DailyDose

చరిత్రలో మార్చి 31

చరిత్రలో మార్చి 31

సంఘటనలు

1919: హైదరాబాదులో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయింది.

1959: 14 వ దలైలామా, టెన్‌జిన్ జియాట్సో భారత సరిహద్దును దాటి భారత్ వచ్చాడు.

2011: 2011 మార్చి 31 నాటికి భారతదేశంలో మొత్తం 8,40,130 మంది వైద్యులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, లోక్ సభలో కేంద్ర ఆరోగ్యమంత్రి 2012 మే 18 నాడు చెప్పారు.

జననాలు

1865: ఆనందీబాయి జోషి, పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. (మ.1887)

1928: కపిలవాయి లింగమూర్తి, ప్రముఖ సాహితీవేత్త, పాలమూరు జిల్లా కు చెందిన ప్రముఖ కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు (మ. 2018).

1933: నటరాజ రామకృష్ణ, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు (మ.2011).

1939: సయ్యద్‌ హుసేన్‌ బాషా, నాటక, చలనచిత్ర నటుడు. కవి. నాటకరచయిత (మ.2008).

1960 : స్టీవ్ అపిల్టన్, మైక్రాన్ టెక్నాజీ సిఇవో.

1987: కోనేరు హంపి, ప్రముఖ చదరంగ క్రీడాకారిణి.

మరణాలు

1727: ఐజాక్ న్యూటన్, సుప్రసిద్ధ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. (జ.1643)

1972: మీనా కుమారి, భారత చలనచిత్ర నటీమణి. (జ.1932)

1995: సెలీనా, మెక్సికన్-అమెరికన్ గాయని, గీత రచయిత్రి. నర్తకి (జ.1971)

పండుగలు మరియు జాతీయ దినాలు

-ప్రపంచ బ్యాకప్ డే