Politics

మాయావతి మాయ చేస్తారా?

mayawati-for-janasena-campaign-in-andhra-2019

రెండ్రోజుల పర్యటనలో భాగంగా బహిరంగసభలు, సమావేశాల్లో పాల్గొంటారు.

రాష్ట్రంలో జనసేన, బీఎస్పీ కూటమి తరఫున ప్రచారం నిర్వహించేందుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి మంగళవారం రాష్ట్రానికి రానున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ తో కలిసి ఎన్నికల ప్రచారం చేస్తారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి రేపు రాష్ట్రానికి రానున్నారు.2 రోజుల పాటు పర్యటించనున్నారు.  జనసేన, వామపక్షాలతో కలిసి కూటమిగా పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్ 2న రాత్రి విశాఖపట్నం చేరుకుంటారు. 3న పవన్ కల్యాణ్ తో కలిసి విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడతారు. మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ మాకినేని బసవపున్నయ్య మైదానంలో బహిరంగసభలో పాల్గొంటారు. 4న తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నిర్వహించే సభలో ప్రసగిస్తారు. ఆ రోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న మాయావతి… ఎల్బీ స్టేడియంలో సభకు హాజరవుతారు. తెలంగాణాలో లోక్​సభ ఎన్నికలకు పోటీలో ఉన్న జనసేన, బీఎస్పీ అభ్యర్థుల తరఫున పవన్ తో కలిసి ప్రచారం చేస్తారు.