Business

ఏమి కంగారు లేదు. మళ్లీ పొడిగించారు.

ఏమి కంగారు లేదు. మళ్లీ పొడిగించారు.

పాన్‌ నంబరుతో ఆధార్‌ కార్డు అనుసంధానం గడువును పెంచుతూ ప్రభుత్వం ఆదివారం ఓ ప్రకటన జారీ చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన గడువు నేటితో ముగిసింది.ఇప్పటికే ఐటీ డిపార్ట్‌మెంట్‌ ఈ అనుసంధానాన్ని తప్పనిసరి చేసింది. 2019-20 సంవత్సరానికి ఐటీ రిటర్నులు ఫైల్‌ చేయాలంటే ఈ అనుసంధానం తప్పనిసరి. మొత్తం నాలుగు విధానాల్లో ఈ అనుసంధానం చేసుకొనేట్లు ఐటీడిపార్ట్‌మెంట్‌ ఏర్పాట్లు చేసింది.అయితే తాజాగా ఆరు నెలల పాటు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువు 2019 సెప్టెంబరు 30నాటికి ముగియనుంది.

మొత్తం నాలుగు విధానాల్లో ఈ అనుసంధానం చేసుకోవచ్చు…
* ఆదాయపన్ను శాఖ ఈఫైలింగ్‌ పోర్టల్‌ సాయంతో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. incometaxindiaefiling.gov.in వెబసైట్‌లో Aadhaar link విభాగంలో ఇది లభిస్తుంది.
* ఇప్పటికే ఐటీశాఖ ఎస్‌ఎంఎస్‌ సౌకర్యాన్ని కూడా కల్పించింది. అవసరమైన వారు 567678 లేదా56161కు UIDPAN<12-digit Aadhaar><10-digit PAN>. అని మెసేజ్‌ చేయాలి.
* ఆన్‌లైన్‌లో ఆదాయపుపన్ను రిటర్ను ఫైల్‌ చేసే సమయంలో ఆధార్‌ సంఖ్యను పాన్‌ సంఖ్యతో అనుసంధానించాలని కోరవచ్చు. ఎన్‌ఎస్‌డీఎల్‌, యూటీఐఐటీఎస్‌ఎల్‌ వెబసైట్లలో లభిస్తుంది.
* పాన్‌ కార్డు దరఖాస్తు సమయంలో కానీ, పాన్‌కార్డులో మార్పులకు దరఖాస్తు సమయంలో మనం ఆధార్‌ అనుసంధానాన్ని కోరవచ్చు.