NRI-NRT

నాట్స్ సంబరాలకు ముమ్మర ఏర్పాట్లు

grand-arrangements-for-nats-convention2019

?????????????????????????????????????
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) అమెరికా తెలుగు సంబరాలను అంబరాన్నంటేలా నిర్వహించేందుకు ముమ్మరంగా కృషి చేస్తోంది. ఇర్వింగ్‌లో మే 24 నుంచి 26వరకు జరిగే ఈ తెలుగు సంబరాల్లో టెక్సాస్ లో ఉండే తెలుగువారందరిని భాగస్వాములు చేసేందుకు కృషి చేస్తోంది. “”మనమంతా తెలుగు- మనసంతా వెలుగు”” అనే స్ఫూర్తితో ఈ సంబరాలను నిర్వహించనున్నట్లు సంబరాల కమిటీ చైర్మన్ కంచర్ల కిషోర్ తెలిపారు. కీరవాణి, మనో, ఆర్పీ పట్నాయక్ తెలుగు సంబరాల్లో సందడి చేయనున్నారని నాట్స్ ఉపాధ్యక్షుడు బాపు నూతి తెలిపారు. సంగీత, సాహిత్య కార్యక్రమాలు, తెలుగుజాతి ప్రముఖులు, విశిష్ట అతిథులతో ముఖాముఖీ కార్యక్రమాలు.. పసందైన వంటకాలతో తెలుగింటి విందు భోజనాలు ఉంటాయని సంబరాల విశేషాలను సంబరాల కార్యదర్శి రాజేంద్ర మాదాల వివరించారు. తెలుగు సంబరాల కోసం 300మందికిపైగా నాట్స్ వాలంటీర్లు పని చేస్తున్నారని రామ్ బండి తెలిపారు. సంబరాల ఏర్పాట్ల పట్ల నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ సంతృప్తి వ్యక్తం చేశారు.


ఇండియాపై గ్లోబల్ వార్మింగ్ ప్రభావంపై నాట్స్ డాలస్ చాప్టర్ స్థానిక తెలుగుచిన్నారులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించింది. ఈ పోటీలకు స్థానిక తెలుగు కుటుంబాల నుంచి మంచి స్పందన లభించింది. ఈ చిత్ర లేఖన పోటీలకు నాలుగేళ్ల వయస్సు నుంచి 18 ఏళ్ల వయస్సు వరకు నాలుగు విభాగాలుగా విభజించి పోటీలు నిర్వహించారు. వీటీలో వందలాది చిన్నారులు తమ ప్రతిభను చూపెట్టారు. తమ సృజనాత్మకతకు ప్రతిబింబించేలా చక్కటి చిత్రాలు గీశారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్త లక్ష్మి సోమంచి, సంబరాల సాంస్కృతిక సమన్వయ కర్త ఆర్య బెల్లం, సహ సమన్వయ కర్తలు చంద్రపొట్టిపాటి, చాక్స్ కుందేటి, సభ్య బృందం విజయ బండి, మాధవి ఇందుకూరి, పల్లవి తోటకూర, మాధవి లోకిరెడ్డి మరియు సంబరాల రిజిస్ట్రేషన్ కమిటీ సభ్యులు సురేంద్ర ధూళిపాళ, శ్రీధర్ విన్నమూరి, క్రీడా విభాగం నుండి శ్రీనివాస్ కాసర్ల అంకిత భావంతో పనిచేసారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంబరాల కమిటీ నాయకులు విజయ శేఖర్ అన్నె (సంయుక్తాధిపతి), ఆది జెల్లి (ఉపాధిపతి), ప్రేమ్ కలిదిండి (ఉపాధిపతి), రాజేంద్ర మాదాల (కార్యదర్శి), బాపు నూతి (కోశాధికారి), మహేశ్ ఆదిభట్ల (సంయుక్త కార్యదర్శి), విజయ్ వర్మ కొండ (క్రయవిక్రయ నిర్దేశకుడు), భాను లంక (ఆతిథ్యం నిర్దేశకుడు), కిషోర్ వీరగంధం (వ్యవహారాల నిర్దేశకుడు), రామిరెడ్డి బండి (కార్యక్రమ నిర్దేశకుడు), నరసింహా రెడ్డి ఊరిమిండి (ప్రసారమాధ్యమ నిర్దేశకుడు), చినసత్యం వీర్నపు (టాంటెక్స్ అధ్యక్షుడు) తదితరులు పాల్గొన్నారు. వీరంతా పోటీల్లో అత్యుత్తమ చిత్రాలనుగీసిన చిన్నారులకు బహుమతులు అందచేసి వారిని ప్రత్యేకంగా అభినందించారు.


అమెరికా తెలుగు సంబరాలకు సన్నాహాకాల్లో భాగంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. డాలస్ లో టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహించింది. దాదాపు 70మందికి పైగా తెలుగువారు ఈ టేబుల్ టెన్నిస్ పోటీల్లో పాల్గొన్నారు. సంబరాల క్రీడా విభాగ సమన్వయకర్త ఎన్ ఎం ఎస్ రెడ్డి, క్రీడా సమన్వయ కర్త శ్రీనివాస్ కాసర్ల, నాట్స్ నాయకత్వ బృందం సభ్యులు బాపు నూతి, రాజేంద్ర మాదాల, ప్రేమ్ కలిదిండి విచ్చేసిన క్రీడా ప్రియులకు స్వాగతం పలికారు. తెలుగు వారందరినీ ఒక వేదికపై కలిసి చిన్నారులకు, యువతకు మన సంస్కృతిని పరిచయం చెయ్యాలని, తెలుగువారి ఐక్యతకు కృషి చేయాలని, ఇలాంటి ఆటలు సుహృద్భావాన్ని పెంచడానికి సదవకాశమని నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ అధిపతి శ్రీనివాస్ గుత్తికొండ తమ సంయుక్త సందేశంలో పేర్కొన్నారు. ఈ పోటీల నిర్వహణకు, అమెరికా తెలుగు సంబరాలకు సహ ఆతిథ్యం అందించడం చాలా సంతోషంగా ఉందని టాంటెక్స్ అధ్యక్షుడు చినసత్యం వీర్నపు పేర్కొన్నారు. 6వ అమెరికా సంబరాల నాయకత్వం బృందం ఈ టేబుల్ టెన్నిస్ పోటీదారులకు విజేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి.. సంబరాలకు రావాలని ఆహ్వానించింది. సంబరాల కమిటీ కన్వీనర్ కిశోర్ కంచెర్ల, విజయ శేఖర్ అన్నె ( సంయుక్తాధిపతి), ఆది జెల్లి (ఉపాధిపతి), ప్రేమ్ కలిదిండి (ఉపాధిపతి), రాజేంద్ర మాదాల (కార్యదర్శి), బాపు నూతి (కోశాధికారి), మహేశ్ ఆదిభట్ల (సంయుక్త కార్యదర్శి), విజయ్ వర్మ కొండ (క్రయవిక్రయ నిర్దేశకుడు), భాను లంక (ఆతిథ్యం నిర్దేశకుడు), కిషోర్ వీరగంధం (వ్యవహారాల నిర్దేశకుడు), రామిరెడ్డి బండి (కార్యక్రమ నిర్దేశకుడు), చినసత్యం వీర్నపు (టాంటెక్స్ అధ్యక్షుడు) తదితరులు క్రీడాకారులను అభినందించారు.