NRI-NRT

ఢిల్లీ ఆంధ్రా స్కూల్లో ఘనంగా ఉగాది వేడుకలు

delhi telugus celebrate ugadi 2019 on a grand scale

ఢిల్లీలోని ఆంధ్రా ఎడ్యుకేషనల్ సొసైటీ సమావేశ మందిరంలో సొసైటీ ఆధ్వర్యంలో వికారినామ ఉగాది వేడుకలను ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డీ.ఆర్.డీ.ఓ.చైర్మన్ జీ.సతీష్‌రెడ్డిలు హాజరయ్యారు. సభాకార్యక్రమాల్లో భాగంగా ఆంధ్ర ఎడ్యూకేషనల్ సొసైటీ మాజీ అధ్యక్షుడు ఎం.వీ.రామారావు, డీ.ఆర్.డీ.ఓ చైర్మన్ సతీష్‌రెడ్డిలను లక్ష్మీప్రసాద్ ఘనంగా సన్మానించారు. అనంతరం లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ స్వరాష్ట్రంలో తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయని, అందుకే తాను ఉగాది పండుగనాడు తెలుగు భాషా సాంప్రదాయాలకు పట్టం కట్టే పక్క రాష్ట్రాల ప్రవాసాంధ్ర సంఘాల కార్యక్రమంలో ఆనందంగా పాల్గొంటున్నాని, విదేశాల్లో కూడా ఎన్నో సంస్థలు తెలుగు భాష కోసం కృషి చేస్తున్నాయని వారిని కొనియాడారు. అనంతరం నిర్వహించిన సినీ సంగీత విభావరి అలరించింది. ఈ వేడుకల్లో సొసైటీ కార్యదర్శి సుంకర ఈశ్వర ప్రసాద్, అధ్యక్షులు పీ.వాసుదేవరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.