Politics

హామీలు నిలబెట్టుకుంటానని ప్రామిసరీ నోటు రాసిన జేడీ

jd lakshmi narayana writes promissory note

విశాఖ లోక్‌సభ స్థానంలో జనసేన అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ శనివారం ఎన్నికల ప్రణాళికను ప్రామిసరీ నోటుపై లిఖితపూర్వకంగా రాసి సంతకం పెట్టి విడుదల చేశారు. అక్కయ్యపాలెం నరసింహనగర్‌లోని పార్టీ నగర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. విశాఖ సిరిపురంలోని బాలాజీనగర్‌లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంటున్నానని చెప్పారు. విశాఖను అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతానని, మూడు నెలలకు ఒకసారి ఎన్నికల ప్రణాళిక అమలుపై నివేదిక విడుదల చేస్తానన్నారు. హామీలను అమలు చేయని పక్షంలో ఎవరైనా తనను నిలదీయవచ్చని, న్యాయస్థానానికి కూడా వెళ్లవచ్చని చెప్పారు. జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ బహిరంగ సభ విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్‌ మున్సిపల్‌ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం జరగనుంది. దీనికి సినీనటుడు రామ్‌చరణ్‌ హాజరుకానున్నారని పార్టీ అనకాపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి చింతల పార్థసారథి తెలిపారు.