Movies

బిందు బాలా

bindhu madhavi teams with director baalaa

బాలా దర్శకత్వంలోని ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌ పూర్తయినా కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదన్న విషయం తెలిసిందే. దీంతో తదుపరి సినిమాపై ఆయన దృష్టి పెట్టారు. ఇందులో అధర్వ, ఆర్యలు హీరోలుగా నటిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు హీరోలతో గతంలో కూడా చిత్రాలు తెరకెక్కించారు బాలా. విక్రం, సూర్యలతో ‘పితామగన్‌’, విశాల్‌, ఆర్యలతో ‘అవన్‌ ఇవన్‌’ వంటి సినిమాలు రూపొందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆర్య, అధర్వలతో కొత్త చిత్రాన్ని తెరకెక్కించనున్నారని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే ఆర్యకు కూడా ఈ సినిమా కథను బాలా వినిపించారని, వెంటనే ఆయన నటించేందుకు ఒప్పుకొన్నట్లు సమాచారం. గతంలో అధర్వతో ‘పరదేశి’ చిత్రాన్ని బాలా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇందులో కూడా మరో భిన్నమైన గెటప్‌లో అధర్వ కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా చిత్రంలో బిందు మాధవిని కథానాయికగా ఎంచుకున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. జీవీ ప్రకాశ్‌ సంగీతం సమకూర్చనున్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.