Movies

మే1న ఏపీలో “లక్ష్మీస్ ఎన్‌టీఆర్” విడుదల

ram gopal varma announces lakshmis ntr release date to be may 1st in andhra

ఎన్నో వివాదాల తర్వాత ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చిలో ఏపీ మినహా అన్ని చోట్లా విడుదలైన సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో చిత్ర విడుదలను నిలిపివేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఏపీలో ఈ సినిమా విడుదలపై స్టే విధించాలని ఈసీని కోరారు. దీంతో విడుదలను ఆపారు. కాగా ఇప్పుడు మే 1న సినిమాను ఏపీలో విడుదల చేయబోతున్నట్లు వర్మ ట్వీట్‌ చేశారు. ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతి జీవితాల ఆధారంగా ఈ సినిమాను తీసినట్లు వర్మ తెలిపారు. కన్నడ నటి యజ్ఞ శెట్టి ఇందులో లక్ష్మీ పార్వతి పాత్రను పోషించారు. ఎన్టీఆర్‌గా రంగస్థల నటుడు విజయ్‌ కుమార్‌ నటించారు. రాకేష్‌ రెడ్డి, దీప్తి బాలగిరి సినిమాను నిర్మించారు.