Politics

మా తమ్ముడి రాజ్యమే వస్తుంది

janasena will form government after 2019 results says nagababu

రానున్నది జనసేన ప్రభుత్వమేనని నర్సాపురం జనసేన ఎంపీ అభ్యర్థి కొణిదెల నాగబాబు అన్నారు. ఉక్కునగరం గురజాడ కళాక్షేత్రంలో బుధవారం జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొద్ది రోజుల్లోనే అద్భుతం చూడబోతున్నామన్నారు. దేశంలో ఉన్న ఉత్తమ నాయకుల్లో పవన్‌కల్యాణ్‌ ఒకరని పేర్కొన్నారు. పవన్‌కల్యాణ్‌కు చిన్నప్పటి నుంచి ఏదో సాధించాలనే తపన ఉండేదని, ఆ తపన నుంచే 2014లో జనసేన పార్టీ ఆవిర్భవించిందన్నారు. గెలుపు, ఓటములతో నిమిత్తం లేకుండా జనసేన పార్టీ ప్రజల గుండెల్లో నిలిచిపోతుందని పేర్కొన్నారు. అనంతరం విశాఖ ఎంపీ అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అపారమైన పరిజ్ఞానం, గుండె ధైర్యం, ప్రజాభిమానం కలిగిన నాయకుడు పవన్‌కల్యాణ్‌ అని అన్నారు. పవన్‌కల్యాణ్‌ గాజువాకలో అధిక మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆయన గెలుపు కోసం జనసైనికులు చేసిన కృషి మరువలేనిదన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి చింతలపూడి వెంకటరామయ్య ఆధ్వర్యంలో నాగబాబును ఘనంగా సత్కరించారు.