Politics

కేజ్రీవాల్‌ను మళ్లీ కొట్టారు

man attacks kejriwal at road show in motinagar during 2019 election campaign

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై మరోసారి దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా దిల్లీలోని మోతీనగర్‌ రోడ్‌షోలో పాల్గొన్న కేజ్రీవాల్‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. ఎరుపు రంగు టీషర్ట్‌ ధరించిన ఓ వ్యక్తి ఒక్క సారిగా .. కేజ్రీవాల్‌ ఉన్న ప్రచార రథంపైకి దూసుకొచ్చి పరుష పదజాలంతో దూషిస్తూ.. చెంపదెబ్బ కొట్టాడు. అంతటితో ఆగకుండా కేజ్రీవాల్‌పై తీవ్రంగా దాడి చేసేందుకు యత్నించాడు. ఈ ఘటనతో అవాక్కయిన కేజ్రీవాల్‌ వెనక్కి జరిగి దుండగుడి దాడి నుంచి తప్పించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ఆప్‌ కార్యకర్తలు దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని చితకబాదారు. కేజ్రీవాల్‌పై దాడి ప్రతిపక్షాల కుట్ర అని ఆప్‌ నేతలు ఆరోపించారు. సీఎంకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని మండిపడుతున్నారు.