NRI-NRT

నాష్‌విల్‌లో ఉగాది వేడుకలు

nashville telugu ugadi 2019

అమెరికాలోని టెన్నెస్సీ తెలుగు సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అధ్యక్షులు దీప్తి రెడ్డి దొడ్ల నాయకత్వంలో జరిగిన ఈ ఉగాది సంబరాల్లో లైవ్ కాన్సర్ట్‌లో గాయనీ గాయకులు సుమంగళి, గీతా మాధురి, రోహిత్, శ్రీకాంత్, మెహర్ చంటి లైవ్ బాండ్‌తో అలరించారు. సుమారు 800 మంది ఆహుతులు పాల్గొన్న ఈకార్యక్రమాన్ని ముందుగా షాలిని వేమూరి భరతనాట్యంతో ప్రారంభించారు. క్రిస్టల్ ఈవెంట్స్ వారు చక్కని స్టేజి డెకరేషన్, ఫోటో బూత్ రెడీ చేయగా, మామ్ అండ్ మీ కాన్సెప్ట్ తో నిర్వహించిన ఫ్యాషన్ షో అందరిని ఆకట్టుకుంది. తొలుత సోలో, తర్వాత డ్యూయెట్ పాటలతో స్టేజి మార్మోగిపోయింది. యాంకర్ సాహిత్య తన వ్యాఖ్యానంతో అబ్బురపరిచింది.