Devotional

తిరుమలలో భారీ రద్దీ

huge rush in ttd compartments

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారిని దర్శించుకునే భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. నడకదారి గుండా వచ్చే భక్తులకు, టైం స్లాట్ టోకెన్ దర్శనానికి, అలాగే స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ కారణంగా అన్ని రకాల క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్లతో పాటు ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడుతోంది.