NRI-NRT

సింగపూర్‌లో భారతీయుల కార్మిక నిధి ప్రారంభం

Singapore Telugu Samajam STS Starts Labor Fund

కార్మిక సోదరులకు “కార్మిక దినోత్సవం” సందర్భంగా  సింగపూర్ తెలుగు సమాజం(STS) వారి ఆత్మీయ పలకరింపు కార్యక్రమం  విజయవంతంగా నిర్వహించారు. సింగపూర్‌లో పని చేస్తున్న 700 మంది పైచిలుకు కార్మికులను ఎస్.టి.ఎస్. ఎగ్జిక్యూటివ్ కమిటీ కలిసి విందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిఫ్ట్ బాక్స్లు అందజేశారు. కార్మికులకు అండగా ఉండటానికి కార్మికుల సహాయనిధిని అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం సెంబవాంగ్,కెన్టెక్, తువాస్, బుకిట్ బటోక్, మెగాయార్డ్, పెంజూరులో ఉన్న హాస్టల్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా STS అధ్యక్షుడు కోటి రెడ్డి మాట్లాడుతూ  కార్మిక సహాయ నిధికి విరాళాలు  ఇవ్వడానికి ముందుకు రావలసిందిగా తెలుగు సమాజం సభ్యులను కోరారు. కార్మిక సోదరులకు “శ్రామిక దినోత్సవ” శుభాకాంక్షలు  తెలిపారు. అనంతరం STS ఉపాధ్యక్షుడు, కార్యక్రమ నిర్వాహకులు జ్యోతీశ్వర్  రెడ్డి మాట్లాడుతూ దాదాపుగా పది పైచిలుకు హాస్టల్స్ లో ఉన్న కార్మికులను కలసి  గిఫ్ట్ బాటిల్స్ ఇచ్చామని, సింగపూర్‌లో ఉన్న తెలుగు వారికి ఏదైనా ఆపద కలిగితే మా కార్యవర్గం సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు. కార్యదర్శి సత్య చిర్ల మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన కార్యవర్గ సభ్యులకు, కార్మిక నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.