Politics

ఓటు వేసిన వెంకయ్య దంపతులు

Indian Vice President Venkaiah Naidu Casts His Vote

లోక్‌సభ ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. దిల్లీలోని నిర్మాణ్‌భవన్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. అనంతరం వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనదన్నారు. ఓటు అనేది హక్కు మాత్రమే కాదని.. బాధ్యతని చెప్పారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చి బాధ్యతగా ఓటు వేశానని తెలిపారు. ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఉపరాష్ట్రపతి కోరారు.