Agriculture

రైతులతో మహేష్ మీటింగ్

mahesh meets farmers as part of maharshi campaign

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌ నటించిన ‘మహర్షి’ సినిమాలో రైతుల సమస్యలపై గళం విప్పడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ‘వీకెండ్‌ వ్యవసాయం’ అన్న కాన్సెప్ట్‌కు విపరీతమైన క్రేజ్‌ లభిస్తోంది. ఈ సినిమాలో సీఈవో పదవికి రిషి (మహేశ్) రాజీనామా చేసి.. వ్యవసాయాన్నే తన వృత్తిగా మార్చుకోవాలనుకుంటాడు. నిజ జీవితంలో కూడా ఇలాంటి ‘రిషి’లు ఎందరో ఉన్నారు. వారిలో కొందరు మహేశ్‌తో ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ పంట చేతికి రాక తన బంధువులు ఆత్మహత్య చేసుకోవడం గురించి వివరించారు. ఆమె మాటలు విన్న మహేశ్‌.. ‘మీరు మాకెంతో స్ఫూ్ర్తిదాయకం. నేను ఇప్పటివరకు కలిసిన గొప్ప వ్యక్తుల్లో మీరొకరు. హ్యాట్సాఫ్‌ టు యూ. మీరున్నారు కాబట్టే మేమున్నాం’ అన్నారు. మహేశ్‌.. రైతులతో పంచుకున్న విషయాలను మీరూ చూసేయండి.