Movies

విగ్రహాన్ని తీసుకెళ్తా

i want to take my husband shahids wax statue with me says mira rajput

సింగపూర్‌లోని మేడం టుసాడ్స్‌ మ్యూజియంలో బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని గురువారం షాహిద్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి షాహిద్‌తోపాటు ఆయన సతీమణి మీరా రాజ్‌పుత్‌ కూడా వెళ్లారు. తన భర్త, మైనపు విగ్రహంతో కలిసి దిగిన ఫొటోను మీరా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘మా వారిని ఇంటికి తీసుకెళ్తాను. ఒక్కర్ని మీ కోసం (మేడమ్‌ టుసాడ్స్‌) ఇక్కడే వదిలేసి వెళ్తాను’ అని ఆమె పేర్కొన్నారు. మైనపు విగ్రహం అచ్చం నిజమైన షాహిద్‌లానే ఉందని పరోక్షంగా ఆమె అన్నారు. నెటిజన్ల నుంచి కూడా విగ్రహానికి మంచి స్పందన లభించింది. ‘ఇందులో ఎవరు నిజమైన షాహిద్‌?’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. షాహిద్‌ జూన్‌ 21న ‘కబీర్‌ సింగ్‌’ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఇంకా ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి కాలేదు. అయితే యూ/ఎ సర్టిఫికెట్‌ లభించే అవకాశం ఉందని షాహిద్‌ అన్నారు.