Movies

ఇష్టం లేకపోయినా అడిగారని…

Aishwarya Rajesh Says She Was Never Interested In Saamy 2-tnilive - telugu news international latest nri nrt global telugu news telugu latest move news

కోలీవుడ్‌లో వరుస చిత్రాలతో బిజీగా రాణిస్తున్న కథానాయిక ఐశ్వర్య రాజేష్‌. ఆమె కథల ఎంపిక చాలా ప్రత్యేకంగా ఉంటుంది, ప్రాముఖ్యం ఉన్న పాత్రల్లోనే నటిస్తూ వస్తున్నారు. ఇటీవల ఆమె తెలుగులో విజయ్‌ దేవరకొండ-క్రాంతి మాధవ్‌ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకు కూడా సంతకం చేశారు. అయితే తాజాగా ఐశ్వర్య ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌ అయ్యింది. విక్రమ్‌తో కలిసి ఆమె ‘సామి 2’ సినిమాలో నటించారు. హరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ మరో కథానాయికగా నటించారు. అయితే అందులో నటించడం తనకు ఇష్టం లేదని ఆమె అన్నారు. ‘‘సామి 2’లో నటించాలి అనుకోలేదు. అలాంటి పాత్రల్లో చేయడం నాకు ఇష్టం లేదు. వ్యక్తిగతంగా కోరడం వల్ల తప్పక చేయాల్సి వచ్చింది. ఆ పాత్రలో నటించేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. నేను కేవలం రెండు పాటలు, రొమాంటిక్‌ సన్నివేశాలకు పరిమితం కావాలి అనుకోవడం లేదు. అలాంటి సినిమాల్లో నేను చేయను’ అని చెప్పారు. 2003లో విక్రమ్, త్రిష జంటగా నటించిన సినిమా ‘సామి’. దీనికి సీక్వెల్‌గా తీసిన ‘సామి 2’కు కూడా త్రిష సంతకం చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకున్నారు. ఆ స్థానంలో ఐశ్వర్య రాజేష్‌ను దర్శక, నిర్మాతలు తీసుకున్నారు.