Politics

వెయ్యి శాతం టీడీపీదే గెలుపు

Chandrababu naidu says he is not in race for prime minister - tnilive telugu news international political news

ఆంధ్రప్రదేశ్‌లో వెయ్యి శాతం టీడీపీదే గెలుపు ఖాయం టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘‘2014 ఎగ్జిట్ పోల్స్‌లో కొన్ని జాతీయ చానళ్లు వైసీపీ గెలుస్తుందని చెప్పాయి.

అయినా మనమే గెలిచాం. ఇప్పుడు కూడా కొన్ని చానళ్లు అలా చెప్పే అవకాశం ఉంది. వారి అంచనాలు మళ్లీ తప్పు అవుతాయి. ఏపీలో నూటికి వెయ్యి శాతం టీడీపీదే గెలుపు’’ అని పార్టీ నేతలతో ఆత్మవిశ్వాసం రెట్టింపు చేశారు.

తాను ప్రధాని పదవి రేసులో లేనని చంద్రబాబు స్పష్టం చేశారు.

జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు కృషి చేస్తున్నానని అన్నారు.

కేంద్రంలో ఒకప్పుడు ఎన్టీఆర్ పాత్రను.. ఇప్పుడు తాను నిర్వహిస్తున్నానని చెప్పారు.

దేశం బాగుపడాలనే ఉద్దేశ్యంతోనే నిస్వార్థంగా పనిచేస్తున్నానని అన్నారు.