WorldWonders

ఫ్రెష్హు శవాలతో ఎరువుల తయారీ

American Researchers get legal green signal to make fertilizer from human dead bodies - tnilive - ఫ్రెష్హు శవాలతో ఎరువుల తయారీ

అమెరికాలోని వాషింగ్టన్ నూతన ఒరవడికి తెర తీసింది. మానవ మృతదేహాలతో పొలాల్లో ఎరువును సృష్టించడాన్ని చట్టబద్ధం చేసింది. భూస్థాపన స్థలాలు, దహన సంస్కారాలు శ్మశానాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.మానవ మృతదేహాలను సేంద్రియ ఎరువుగా మార్చడాన్ని చట్టబద్ధం చేసింది. భూస్థాపన స్థలాలు, శ్మశానాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. చనిపోయిన వారి కళేబరాలను ఉద్యానవనాల్లో ఎరువుగా ఉపయోగించేందుకు అనుమతించనుంది .”ప్రకృతికి తిరిగివ్వడం అనేది మానవ జీవన చక్రంలో భాగం. మరణం కూడా ఇందులో అందంగా కన్పిస్తుంది.”-కత్రినా స్పేడ్, మానవ ఎరువు పరిశోధకురాలు. నవ మృతదేహంతో ఎరువు తయారీ అనే అంశంపై పదేళ్ల కిందట తనకు ఆసక్తి కలిగిందని కత్రినా చెప్పారు. సాంకేతికంగా అమలు సాధ్యమేనా అని పరిశీలించారు. ఈ ప్రక్రియలో భాగంగా మృతదేహాన్ని30 రోజుల పాటు ఓ పెట్టెలో ఉంచుతారు. అనంతరం ఎరువుగా వాడతారు.వచ్చే సంవత్సరం మే నుంచి ఈ చట్టం అమలవుతుంది.