Politics

జగన్‌ను కలిసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

Yarlagadda Lakshmiprasad meets YS Jagan and requests to save and safeguard Telugu language

కేంద్రీయ హిందీ సమితి సభ్యులు, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కార గ్రహీత, మాజీ రాజ్యసభ సభ్యులు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వైకాపా అధ్యక్షుడు, ఏపీ తదుపరి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డిని గురువారం నాడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో తెలుగువారి భవిష్యత్తుతో పాటు, తెలుగు భాష భవితను కూడా సంరక్షించేలా ప్రభుత్వం తరఫున పెద్ద ఎత్తున విస్తృతమైన చర్యలు తీసుకోవాలని ఆయన జగన్‌కు వినతిపత్రం అందించారు. శుక్రవారం నాడు డల్లాస్‌లో జరిగే నాట్స్ సభలకు యార్లగడ్డ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.