Movies

ఇదే చివరిసారి

Disha pathani thinks she can no longer work with salman

బాలీవుడ్‌ సూపర్‌స్టార్ సల్మాన్‌ ఖాన్‌తో కలిసి పనిచేయడం ఇక కుదరదేమోనని అంటున్నారు నటి దిశా పటానీ. సల్మాన్‌ నటించిన ‘భారత్‌’ సినిమాలో దిశా కీలక పాత్రను పోషించారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘భవిష్యత్తులో సల్మాన్‌తో కలిసి మళ్లీ పనిచేయలేనేమో. ఎందుకంటే నాకు, సల్మాన్‌కు వయసు రిత్యా ఎంతో వ్యత్యాసం ఉంది. దర్శకుడు అలీ అబ్బాస్‌ నాకు ఫోన్‌ చేసినప్పుడు కూడా ఇదే విషయం చెప్పారు. సినిమాలో నాది ట్రాపేజ్‌ ఆర్టిస్ట్‌ పాత్ర అని ఆయన చెప్పడంతో వెంటనే ఒప్పుకొన్నాను. ఈ సినిమాలో నేను సల్మాన్‌తో కలిసి కొన్ని సన్నివేశాల్లో, ఒక పాటలో నటించాను. ఎందుకంటే ఈ పాట వచ్చేటప్పుడు సినిమాలో సల్మాన్‌ 30 ఏళ్ల యువకుడిలా కనిపిస్తారు. అలాంటప్పుడు నేను ఆయన పక్కన కనిపించడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ మున్ముందు ఇలాంటి పాత్రలే వస్తాయని చెప్పడానికి లేదు. కాబట్టి సల్మాన్‌తో ఇదే నాకు చివరి సినిమా కావచ్చు’ అని వెల్లడించారు దిశా. ‘భారత్‌’ సినిమాలో కత్రినా కైఫ్‌ కథానాయికగా నటించారు. రంజాన్‌ సందర్భంగా జూన్‌ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.