DailyDose

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు-వాణిజ్య-05/28

May 28 2019- Daily Business News In Telugu - Indian Stock Markets Lose

*దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నాయి. ఒంటిగంట సమయానికి సెన్సెక్స్‌ 31, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 69.62గా ఉంది.
*హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఔషధ కంపెనీ నాట్కో ఫార్మా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ఖాతాల ప్రకారం రూ.486.70 కోట్ల మొత్తం ఆదాయాన్ని, రూ.120.40 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
*బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)ల కోసం ఆర్‌బీఐ ప్రకటించిన ముసాయిదా ద్రవ్యలభ్యత నిబంధనలు ఆ సంస్థల మార్జిన్లు, ప్రతిఫలాలపై మధ్యకాలంలో ఒత్తిడి తీసుకురావచ్చని విశ్లేషకులు అంటున్నారు.
*ప్రభుత్వ రంగ సంస్థ భెల్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.682.70 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
*గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో గెయిల్‌ ఇండియా రూ.1,222.23 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
*ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.589.60 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
*ఎగుమతులను ప్రోత్సహించడానికి అపుడే రంగం సిద్ధమైంది. మే 30న గద్దెనెక్కనున్న మోదీ ప్రభుత్వ పరిశీలన కోసం వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన పరిశ్రమల, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహకాల విభాగం(డీపీఐఐటీ) 100 రోజుల ప్రణాళికను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
*అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ గ్రూప్‌ తన ఎఫ్‌ఎమ్‌ రేడియో వ్యాపారాన్ని విక్రయించనుంది. ‘బిగ్‌ ఎఫ్‌ఎమ్‌’ రేడియోలో వాటాను జాగరణ్‌ ప్రకాశన్‌కు చెందిన మ్యూజిక్‌ బ్రాడ్‌క్యాస్ట్‌(ఎమ్‌బీఎల్‌)కు రూ.1050 కోట్ల ఎంటర్‌ప్రైజ్‌ అంచనా విలువకు అమ్మనున్నట్లు అధికార ప్రకటన ఒకటి వెల్లడించింది.