Politics

కిషన్‌రెడ్డికి మంత్రి పదవి ఖరారు

Kishanreddy becomes central minister in Modis cabinet

నరేంద్రమోదీ కేబినెట్‌లో తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డికి బెర్త్ దక్కింది. ఈ మేరకు పీఎంవో నుంచి ఆయనకు ఫోన్ చేసి మంత్రిగా ప్రమాణం చేయడానికి ఇవాళ రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్‌కు రావాలని చెప్పారు. కిషన్‌రెడ్డికి మంత్రి పదవి రావడంతో తెలంగాణలోని బీజేపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి అనుచరులు నిన్నటి నుంచే ఢిల్లీలో ఉండి తమ నేతకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డికి రాజకీయ అనుభవం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధ్యక్షుడుగా పనిచేశారు. తర్వాత తెలంగాణ బీజేపీ చీఫ్‌గా ఉన్నారు. ఎమ్మెల్యేగా కూడా పని చేశారు. ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని పటిష్టం చేయాలనే ఉద్దేశంతోనే ఆయనకు మోదీ మంత్రి పదవి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.