Movies

త్రివిక్రమ్‌తో సూర్య చర్చలు

Suriya in discussions with Trivikram for new movie

కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌ ఏర్పరచుకున్న కథానాయకుడు సూర్య. ఆయన నటించిన సినిమాలు దాదాపు తెలుగులోనూ విడుదల అవుతాయి. సూర్య కొత్త సినిమా ‘ఎన్జీకే’ మే 31న విడుదల కాబోతోంది. సెల్వరాఘవన్‌ దర్శకుడు. సాయి పల్లవి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికలు. ఈ చిత్రం ప్రచారంలో భాగంగా సూర్య హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. తన సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘నేను, త్రివిక్రమ్‌తో చాలాసార్లు ఓ ప్రాజెక్టు విషయమై మాట్లాడుకున్నాం. ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తెలుగులో సినిమా చేయడానికి నేనూ ఆసక్తిగానే ఎదురుచూస్తున్నా’.
* మీ స్నేహితుడు జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఓ స్నేహితుడిగా మీ స్పందన ఏంటని ప్రశ్నించగా.. ‘చాలా సంతోషంగా ఉంది. పదేళ్ల కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది. తను ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలి. ప్రస్తుతం ఆయనపై హిమాలయాలంత బరువు ఉంది. ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వాటన్నింటినీ ఎదుర్కొంటారని ఆశిస్తున్నా’ అని సూర్య చెప్పారు.
* ‘యాత్ర 2’లో మీరు నటిస్తారని వార్తలొచ్చాయి అని అడగగా.. ‘ఆ కథ నా వరకూ వచ్చి, స్క్రిప్టు నచ్చితే తప్పకుండా చేస్తా’ అని ఆయన పేర్కొన్నారు.