సక్సెస్, ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటున్నారు పూజా హెగ్డే. ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఎఎ19’లో నటిస్తున్నారు. ‘దువ్వాడ ‘జగన్నాదమ్’ తర్వాత బన్నీతో మరోసారి జతకట్టిన చిత్రమిది. ‘మహర్షి’ సక్సెస్ ఆస్వాదిస్తూ టూర్లు, ట్రిప్పులు అంటూ ఓ నెల గ్యాప్ తీసుకున్న ఈ ముంబై బ్యూటీ త్రివిక్రమ్ సినిమా సెట్లో అడుగుపెట్టారు. బుధవారం హైదరాబాద్లో ఈ సినిమా రెండో షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్లో పూజాహెగ్డే కూడా కలిశారు. ‘‘ఓ మంచి టీమ్, ఎంటర్టైనింగ్ స్టోరీ, క్రేజీ కాంబినేషన్తో సెట్లో అడుగుపెట్టా. ఐ యామ్ బ్యాక్’’ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు పూజాహెగ్డే. గీతా ఆర్ట్స్, హారికా ్క్ష హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ నిర్మాతలు.
నేను వచ్చేశా
Related tags :