NRI-NRT

కృష్ణా కలెక్టర్‌కు ₹35లక్షలు అందించిన కోమటి జయరాం

Komati Jayaram Delivers 35Lakhs INR Cheque To Krishna Collector Imtiaz Towards Digital Classrooms In Krishna District

తెదేపా హయాంలో ఆంధ్ర రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం సారథ్యంలో ఏపీ జన్మభూమి ఆధ్వర్యంలో విరాళాలను సేకరించారు. ఈ క్రమంలో భాగంగా కృష్ణా జిల్లాలోని 100 పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు ప్రవాసులు అందించిన ₹35లక్షల చెక్కును జయరాం శుక్రవారం నాడు కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్‌కు అందజేశారు. విద్యా వ్యవస్థ పటిష్ఠవంతానికి ప్రవాసుల చేయూతను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. ఈ నిధికి పెద్దమొత్తంలో సాయపడిన ప్రవాసాంధ్ర ప్రముఖుడు డా.లకిరెడ్డి హనిమిరెడ్డికి జయరాం, కలెక్టర్ ఇంతియాజ్‌లు ధన్యవాదాలు తెలిపారు.