Movies

ఛార్మికి బెదిరింపులు

Charmmee Kaur Complains To Cyberabad Over Blackmailing

రామ్‌ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. విడుదలకు ముందే సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారంటూ ఆ చిత్ర సహ నిర్మాత ఛార్మి సైబరాబాద్‌ పోలీసులను ఆశ్రయించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో బజ్‌ బాస్కెట్‌ గ్రూప్‌లో ఈ చిత్రం స్ర్కిప్ట్‌ లీక్‌ అయిందని, గ్రూప్‌ అడ్మిన్‌ మురళీ కృష్ణ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. తొలుత చిత్ర బృందం నేరుగా మురళీకృష్ణ వద్దకే వెళ్లి సంప్రదింపులు జరిపింది. అయితే అతడు భారీ మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేశాడట. అడిగిన డబ్బు ఇవ్వకపోతే స్క్రిప్ట్‌ మొత్తాన్ని అన్ని సామాజిక మాధ్యమాల వేదికల్లోనూ షేర్‌ చేస్తానని బెదిరించాడట. దీంతో ఈ చిత్ర సహ నిర్మాత ఛార్మి సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.