ఇలా కన్నుకొట్టి అలా కుర్రకారును తనవైపుకు తిప్పుకున్న ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆమె తొలి సినిమా ‘ఒరు అడార్ లవ్’ (తెలుగులో ‘లవర్స్ డే’) విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం ఆమె హిందీ సినిమా ‘శ్రీదేవి బంగ్లా’లో నటిస్తున్నారు. కాగా ఆమె తెలుగులో కొత్త ప్రాజెక్టుకు సంతకం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. యువ కథానాయకుడు నితిన్, దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోంది. మార్చిలో నితిన్ ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. ‘ఇది నాకు ఎంతో సవాలుతో కూడుకున్న సినిమా’ అని పేర్కొన్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో కథానాయికగా ప్రియా వారియర్ను అనుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు దర్శక, నిర్మాతలు ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వదంతులపై చిత్ర బృందం ఇంకా స్పందించలేదు. నితిన్ ప్రస్తుతం ‘భీష్మ’ సినిమాలో నటిస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకుడు. రష్మిక కథానాయిక పాత్ర పోషించారు.
టాలీవుడ్ రెడీ
Related tags :