నిన్న కొడుకు.. నేడు కూతురు..
బయటకొస్తున్న ‘కే’ ట్యాక్స్ బాధితులు..
కోడెల కుమార్తెపై కేసు నమోదు..
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం కే ట్యాక్స్ పేరుతో సాగించిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
ఐదేళ్లుగా కోడెల కుటుంబం దాష్టీకానికి బలైన బాధితులు ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు.
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోడెల కుమారుడు శివరామ్ చేసిన అవినీతి, అక్రమాలపై ఇప్పటికే కేసు నమోదుకాగా…
తాజాగా ఆయన కూతురు అవినీతి భాగోతం బట్టబయలైంది.
భూ కబ్జాతో పాటు కే ట్యాక్స్ వసూలు కోసం ఓ మహిళను బెదిరించడంతో పాటు దాడి చేయడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు బుక్ చేశారు.