భారత్-ఆసీస్ మ్యాచ్లో తెదేపా ఎంపీ – లండన్: ప్రపంచకప్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో తెదేపా ఎంపీ రామ్మోహన్నాయుడు సందడి చేశారు. తన సతీమణి శ్రావ్యతో కలిసి మ్యాచ్ను నేరుగా వీక్షించారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. టీమిండియాకు ఆల్ది బెస్ట్ చెప్పారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీకాకుళం ఎంపీగా రెండోసారి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఓవల్ వేదికగా జరుగుతున్న టీమిండియా-ఆస్ట్రేలియా మ్యాచ్లో అగ్ర కథానాయకుడు మహేశ్బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి సందడి చేశారు. ప్రస్తుతం విహారయాత్రలో ఉన్న మహేశ్ కుటుంబంతోపాటు క్రికెట్ మైదానానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మహేశ్, నమ్రత, గౌతమ్లతో కలిసి దిగిన సెల్ఫీని వంశీ ట్విటర్లో షేర్ చేశారు. ‘ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా..’ అంటూ ‘సెలబ్రేటింగ్ మహర్షి’ అనే హ్యాష్ట్యాగ్ను జత చేశారు. టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.