Politics

పాపం కోడెలను అందరూ వదిలేశారు

TDP Leaders Ignore And Staying Away From Kodela

అధికారంలో ఉన్నప్పుడు హద్దులు మీరి విర్రవీగుతూ అక్రమాలకూ పాల్పడితే ఏవిధమైన గతి పడుతుందో మాజీ స్పీకర్ కోడెల కేసులే. ప్రస్తుతం అధికారంలో ఉన్న వారికి ఇదొక గుణ పాటం. కే ట్యాక్స్ వ్యవహారంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆయన కుమారుడు కుమార్తె పై వస్తున్నా ఫిర్యాదుల పై నోరు మెదపకూడదని తెదేపా నిర్ణయించినట్లు తెలిసింది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కోడెలను వెనకేసుకు వస్తే ఉన్న పరువు కూడా పోతుందని ఆ విషయంలో నిశ్సబ్దంగా ఉంటె మంచిదని పలువురు పార్టీ సీనియర్ నేతలు సూచించడంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అధికారంలో ఉన్న సమయంలో తమ నుంచి డబ్బులు వసూలు చేశారని అనేక మంది బాధితులు కోదేలతో పాటు ఆయన కుమారుడు కుమార్తె పై వాడుసగా ఫిర్యాదులు చేస్తున్న విషయం తెలిసిందే ఇవన్నీ రాజకీయ వేదిమ్పుల్లో భాగంగానే వస్తున్నాయనే ఒక ప్రతినిధి బృందం దీజేపీకి ఫిర్యాదు చేయాలనీ రెండు రోజుల క్రితం తెదేపా శాసనసభపక్ష సమావేశంలో నిర్ణయించారు. సోమవారం ఆ బృందం డీజీపీని కలవాలని నిర్ణయించినా టీడీపీ నాయకులెవరూ వెళ్లలేదు. ఆ తర్వాత జరిగిన మరో సమావేశంలో పలువురు నాయకులు కోడెల వైఖరిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో చంద్రబాబు మిన్నకుండిపోయినట్లు సమాచారం. కోడెల కుటుంబీకులపై ఎప్పటి నుంచో తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, చాలామంది ఆయన, ఆయన కుమారుడు, కుమార్తె అవినీతి వ్యవహారాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని టీడీపీ ఉప నేత బుచ్చయ్యచౌదరి ఆ సమావేశంలో మండిపడినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో పార్టీ తలదూర్చితే ఆయన అవినీతి వ్యవహారాలను సమర్థించినట్లవుతుందని, మౌనంగా ఉంటే మంచిదని, లేకపోతే ఉన్న పరువు కూడా పోతుందని చెప్పడంతో చంద్రబాబు వెనక్కి తగ్గినట్లు తెలిసింది. అందుకే కోడెలను సమర్థిస్తూ ఏ ఒక్క టీడీపీ నాయకుడు మాట్లాడేందుకు ముందుకు రావడంలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.