టిటిడీ చైర్మన్ పదవి తనకు వెంకటేశ్వర స్వామీ దయవల్ల వచ్చిందని, దేవుడు దయతో వచ్చిన పదవిని వదులుకోవడం శుభప్రదం కాదని ఇప్పటివరకు వాదిస్తూ వచ్చిన టిటిడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ వైకాపా ప్రయోగించిన అస్త్రానికి బెంబేలెత్తిపోయారు. ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. టిటిడీ ఆద్వర్యంలో ఉన్న స్విమ్స్ ఆస్పత్రిలో సుధాకర్ యాదవ్ ఆద్వర్యంలో పలు అవకతవకలు జరిగాయని వాటిపై విచారణ జరపాలని టిటిడీ ఈవో అనీల్ కుమార్ సింఘాల్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిమీద ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈనేపద్యంలో పుట్టా సుధాకర్ యాదవ్ బుధవరం నాడు తన పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు ఈవోకు లేఖను పంపారు.దీంతో వైవీ సుబ్బారెడ్డి టిటిడీ చైర్మన్ గా నియమితులు కావటానికి మార్గం సులభతరం అయ్యింది.
దారికి వచ్చిన పుట్టా…చైర్మన్ పదవికి రాజీనామా.
Related tags :