Movies

దిశా దురదృష్టం

Disha pathani speaks of losing chance to act with Katrina

బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌తో కలిసి పనిచేయకపోవడం దురదృష్టంగా భావిస్తున్నానని అంటున్నారు నటి దిశా పటానీ. వీరిద్దరూ ఇటీవల విడుదలైన ‘భారత్‌’ సినిమాలో కథానాయికలుగా నటించారు. అయితే వీరిద్దరూ కలిసి నటించిన సన్నివేశం సినిమాలో ఒక్కటీ లేదు. ఈ నేపథ్యంలో ‘భారత్‌ సినిమాలో అవకాశం వచ్చినందుకు ఎలా ఫీలవుతున్నారు?’ అని మీడియా వర్గాలు అడిగిన ప్రశ్నకు దిశా ఈ విధంగా సమాధానమిచ్చారు. ‘సల్మాన్‌తో కలిసి పనిచేసినందుకు సంతోషంగా భావిస్తున్నాను. ఆయన కష్టపడే వ్యక్తి. అర్థం చేసుకుంటారు. అందరితో మంచిగా ఉంటారు. నటుడిగా ఇన్నేళ్ల అనుభవం ఉన్న వ్యక్తి ఇంత ఒదిగి ఉండటం చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. అయితే ‘భారత్’ సినిమాలో కత్రినా కైఫ్‌తో తెర పంచుకోలేకపోయానన్న బాధ మాత్రం అలాగే ఉంది. సినిమాలో నేను 1990ల కాలంలో వచ్చే సన్నివేశాల్లో కనిపిస్తాను. కానీ కత్రినాది 2000 సంవత్సరంలో వచ్చే పాత్ర. సినిమాలో ఇద్దరం ఉన్నప్పటికీ ఆమెతో కలిసి నటించే అవకాశం రాకపోవడం నా దురదృష్టం’ అని వెల్లడించారు దిశా. ప్రస్తుతం ఆమె ‘మలంగ్’ సినిమాలో నటిస్తున్నారు. మోహిత్‌ సూరీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది.