అమెరికాలోని న్యూజెర్సీలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని భారత కాన్సుల్ జనరల్ సందీప్ చక్రవర్తి, డిప్యూటీ కాన్సుల్ జనరల్ శత్రుఘ్న సిన్హా ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో రెండు వేలకు పైగా ఔత్సాహికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శతాధికులు, ప్రముఖ యోగా గురువులు తావో పోర్చోన్ లించ్, భారత్కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు గౌర్ గోపాల్ దాస్, సెలెబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా ప్రత్యేక అతిథులుగా హాజర్యయ్యారు. అంతేకాకుండా అమెరికన్ కాంగ్రెస్ మెన్, తెలుగు వారైన ఉపేంద్ర చివుకుల, అమెరికాకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా యోగాకు విస్తృత ప్రచారం కల్పించి, యోగా గొప్పదనాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఘనత భారతదేశానికే దక్కుతుందన్నారు.
న్యూజెర్సీ భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం
Related tags :