Politics

NRIలకు ఆధార్ కార్డులు

NRIs To Get Aadhaar Cards - Nirmala Sitharaman Confirms

భారత పాస్‌పోర్ట్‌ కలిగిన ప్రవాస భారతీయులకు (ఎన్‌ఆర్‌ఐ)లకు ఆధార్‌ కార్డులు జారీ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఆధార్‌ కార్డుల కోసం ఎన్‌ఆర్‌ఐలు ఇక 180 రోజులు వేచిచూడాల్సిన అవసరం లేదని అన్నారు.ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌ కార్డుల జారీ ప్రక్రియలో జాప్యాన్ని నివారించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.ఈ ఏడాది కొత్తగా నాలుగు రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.