Politics

మా మామయ్య…సొచ్చమైన నీతి నిజాయితీతో ఎదిగారు

LOkesh Denies Insider Trading Benefitted Nandamuri Balakrishna

రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ మండిపడ్డారు. వైకాపా నాయకులు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామనుకుంటున్నారని ట్విటర్‌ ద్వారా ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ‘ఫేక్‌’ బతుకు మారలేదని.. అసత్యాలతో కాలం నెట్టుకొస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని దెబ్బతీయడానికి అనవసర ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎదిగిన చరిత్ర వైకాపా నాయకుడిదని పరోక్షంగా సీఎం జగన్‌నుద్దేశించి విమర్శలు చేశారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా ఏరోజూ అటువైపు చూడకుండా స్వచ్ఛమైన మనసు, నీతి, నిజాయతీతో నందమూరి బాలకృష్ణ ఎదిగారని చెప్పారు. అలాంటి వ్యక్తి రాజధానిలో భూములు కొన్నారంటూ వైకాపా నేతలు ఆరోపిస్తున్నారని, దమ్ముంటే నిరూపించాలని లోకేశ్‌ సవాల్‌ విసిరారు. నిరూపించలేకపోతే రాజధాని రైతులకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.