బాలీవుడ్ తార రాఖీ సావంత్ తనకు పెళ్లయిందని అంగీకరించారు. సన్నిహితుల మధ్య ఇటీవల వివాహం జరిగిందని, తన భర్త ఎన్నారై అని చెప్పారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ ‘‘మా ఆయన పేరు రితీశ్. ఆయన యు.కెలో ఉంటారు. పెళ్లయ్యాక ఇటీవల మళ్లీ వెళ్లారు. నాకు వీసా రాగానే నేనూ వెళ్తాను. ఇంత మంచి భర్తనిచ్చినందుకు నేను జీస్సకి ధన్యవాదాలు చెబుతున్నా. ఆయన నా ఫ్యాన్. నా ఇంటర్వ్యూ చూసి ఒకసారి నాకు వాట్సాప్ చేశారు. అలా మెసేజ్ల నుంచి ఒకడుగు ముందుకేసి మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. కొంతకాలంలోనే స్నేహితులమయ్యాం. ఇదంతా గత ఏడాది జరిగింది. తను పరిచయమైన కొన్నాళ్లకే, నన్ను అతనికి భాగస్వామిని చేయమని దేవుడిని కోరుకోసాగాను. దేవుడు నా మొర ఆలకించాడు’’ అని అన్నారు. ‘‘మంచి పాత్రలు వచ్చినప్పుడు ఇండియాకు వస్తాను. టీవీ షోలు నిర్మించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఆ కోరిక ఇప్పటికి తీరింది’’ అని చెప్పారు. ఇటీవల చేతినిండా గాజులతో, నుదుట బొట్టుతో ఉన్న రాఖీకి పెళ్లయిందని వార్తలు వినిపించాయి. అయితే వాటిలో నిజం లేదని అప్పుడు ఆమె కొట్టిపారేసిన విషయం తెలిసిందే.
హో గయా!
Related tags :