NRI-NRT

నేడు న్యూయార్క్ ప్రవాసులతో సమావేశం కానున్న యార్లగడ్డ

నేడు న్యూయార్క్ ప్రవాసులతో సమావేశం కానున్న యార్లగడ్డ-Yarlagadda LakshmiPrasad To Meet With NewYork Local Telugu NRIs

ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా నియమితులైన మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు తానా అధ్యక్షుడు తాల్లూరి జయశేఖర్, తానా RVP రామిశెట్టి సుమంత్‌ల ఆధ్వర్యంలో న్యూయార్క్‌లోని బీన్జ్ రెస్టారెంట్‌లో స్థానిక ప్రవాసులతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పరిచారు. ఈ కార్యక్రమంలో ఏపీలో తెలుగు భాషాభివృద్ధికి పటిష్ఠవంతానికి ప్రవాసుల నుండి యార్లగడ్డ పలు సలహాలు సూచనలు అందుకోనున్నారు. అనంతరం ఆయన నేటి రాత్రికి బయల్దేరి అమరావతికి తిరుగుపయనమవుతారు. ఈ వారంలో ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు.