టెస్టుల్లో భారత జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్గా విరాట్ కోహ్లి నిలిచాడు.
ఇంతకు ముందు ఈ రికార్డు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరిట ఉంది.
వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించడంతో ఈ రికార్డు విరాట్ సొంతమైంది.
ధోని 60 టెస్టు మ్యాచ్లకు కెప్టెన్సీ వహించి 27 విజయాలు అందించగా, కోహ్లి 48 టెస్టు మ్యాచ్లకు ప్రాతినిథ్యం వహించి 28 విజయాలు సాధించాడు.
గత మ్యాచ్ ద్వారా గంగూలీ రికార్డు ఆసియా అవతల అత్యధిక విజయాల రికార్డును తుడిచేసిన కోహ్లి.. ఈ మ్యాచ్తో మహీ రికార్డు బద్దలు కొట్టాడు.
కాగా, టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్గా సౌతాఫ్రికా కెప్టెన్ గ్రేమ్స్మిత్(109 మ్యాచ్ల్లో 53 విజయాలు)తొలి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 48 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు.
స్టీవ్ వా(33) విజయాలతో మూడో స్థానంలో ఉండగా, నాలుగో స్థానంలో కోహ్లి నిలిచాడు.