భారత్లో గత 21 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వాహనాల అమ్మకాలు ఒక్క ఆగష్టులోనే పడిపోయాయి.
ఇందులో ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్రవాహనాల అమ్మకాల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫాక్చర్ (సియామ్) నివేదిక పేర్కొంది.
1997-98లో తమ ప్రస్థానం ప్రారంభమైన నాటినుంచి ఆటోమొబైల్ సేల్స్ పై తాము సమాచారం సేకరిస్తున్నామని చెప్పిన సియామ్ ఇంత దారుణంగా అమ్మకాలు పడిపోవడం ఇదేతొలిసారి అని వెల్లడించింది.