ఉత్పత్తిని నిలిపివేత ప్రకటించిన అశోక్ లే ల్యాండ్
ఆర్థిక మాంద్యం వల్ల ఇప్పటికే మారుతీ సుజికీ సంస్థ కొన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు మరో పెద్ద కంపెనీ అశోక్ లేల్యాండ్ కూడా ఇదే నిర్ణయాన్ని వెల్లడించింది.
తన ఉత్పత్తులకు డిమాండ్ లేకపోవడంతో.. కొన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేయనున్నట్లు అశోక్ లేల్యాండ్ వెల్లడించింది.
సెప్టెంబర్లో ప్రొడక్షన్ హాలీడేను ప్రకటిస్తున్నట్లు ఆ సంస్థ ఇవాళ పేర్కొన్నది. స్టాక్ మార్కెట్లకు కూడా ఈ విషయాన్ని చేరవేసింది.
ఎన్నోర్ ప్లాంట్లో 16 రోజులు, హోసూర్ ప్లాంట్లో అయిదు రోజుల పాటు ఉత్పత్తి ఉండదని పేర్కొన్నది.
ఇదే నెలలో పంత్నగర్ ప్లాంట్లో 18 రోజులు, అల్వార్, బందారా ప్లాంట్లలో పదేసి రోజులు ఉత్పత్తి ఉండదని సంస్థ తెలిపింది.