మగవారి విషయంలో తన ఆలోచనలు, అభిప్రాయాల్ని అమ్మ శ్రీదేవి నమ్మేవారు కాదని బాలీవుడ్ నటి జాన్వి కపూర్ అన్నారు. ‘ధడక్’ తర్వాత ఈ భామ బాలీవుడ్లో సెన్సేషన్గా మారారు. ఆమె ఫొటోలు, వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉన్నాయి. సోషల్మీడియాలో జాన్వికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ బ్యూటీ తాజాగా ఓ మ్యాగజైన్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మగవారి పట్ల తన ఆలోచనలు గురించి ప్రస్తావించారు. ‘శ్రీదేవితో ఎప్పుడైనా మీ పెళ్లి గురించి చర్చించారా?’ అని ప్రశ్నించగా.. ‘మాట్లాడాను.. మగవారి విషయంలో నా తీర్పుపై నమ్మకం లేదని అమ్మ అనేది. ఈ విషయంలో నా అభిప్రాయాల్ని నమ్మేది కాదు. నా కోసం ఒకర్ని తనే సెలక్ట్ చేయాలి అనుకుంది. ఎందుకంటే నేను ఇతరుల్ని చాలా తేలిగ్గా ప్రేమించేస్తుంటాను’ అని అన్నారు. అనంతరం ‘మీకు కాబోయే వాడు ఎలా ఉండాలని అడగగా’.. ‘అతడికి తన వృత్తి పట్ల అంకితభావం ఉండాలి..చాలా నైపుణ్యం ఉండాలి.. అతడి దగ్గర కొత్త విషయాలు నేర్చుకోవడానికి నేను ఉత్సుకత చూపించాలి. అంతేకాదు హాస్యచతురత చాలా ముఖ్యం. నేనంటే అతడికి బాగా ఇష్టం ఉండాలి’ అని జాన్వి చెప్పారు. పెళ్లి గురించి ముచ్చటిస్తూ.. ‘నాకు అన్నీ సహజంగా ఉండటమే ఇష్టం. నేను నేనులా ఉండాలి. గొప్పగా, ఫ్యాన్సీగా ఉండేందుకు ఇష్టపడను. నా పెళ్లి సంప్రదాయ బద్ధంగా తిరుపతిలో జరుగుతుందని నాకు తెలుసు. నేను కంచి జరీ చీర కట్టుకుంటాను. పెళ్లి తర్వాత నాకు ఇష్టమైన దక్షిణాది వంటకాలు ఇడ్లీ, సాంబార్, పెరుగన్నం, ఖీర్ తదితర వంటకాలతో భోజనం ఉంటుంది’ అని ఆమె ముందుగానే లిస్ట్ చెప్పేశారు.
తిరుపతిలో శ్రీదేవి కూతురి పెళ్లి
Related tags :