Sports

మళ్లీ గుప్పుమంటున్న ధోనీ రిటైర్మెంట్ వార్తలు

Dhoni To Announce Retirement This Evening

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ మరికాసేపట్లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

దక్షిణాఫ్రికాతో మరో మూడు రోజుల్లో జరగనున్న టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో ధోనీకి చోటు దక్కలేదు.

దీనికితోడు, ప్రపంచకప్ తర్వాతి నుంచి ధోనీ వీడ్కోలుపై ఊహాగానాలు మొదలయ్యాయి.

ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు విండీస్‌లో పర్యటించగా, ధోనీ మాత్రం రెండు నెలలపాటు సెలవు తీసుకుని ఆర్మీలో కొన్ని రోజులు సేవలందించాడు.

అయితే, ఇటీవల దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో ధోనీకి చోటు దక్కకపోవడంతో మరోమారు ధోనీ రిటైర్మెంట్ వార్తలు తెరపైకి వచ్చాయి.