NRI-NRT

లండన్‌లో ఘనంగా గణనాధుని నిమజ్జనం

Hyderabad Friends Perform Ganesh Nimajjan In London

లండన్ నగరంలోని హౌంస్లోలో హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో 7వ సారి వినాయక చవితి, నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణేశ్‌ విగ్రహ ఊరేగింపు శోభాయమానంగా సాగింది. లండన్ వీధుల్లో ప్రవాసుల నృత్యాలతో నిమజ్జన కార్యక్రమం సాగింది. పూజ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డును ధనంజయ్ వేలంపాటలో 1360 పౌండ్లకు దక్కించుకున్నారు. అనంతరం గణపయ్యకు పూజలు చేసిన భక్తులు థేమ్స్ నదిలో నిమజ్జనం చేశారు. లండన్ ఎన్నారై తెరాస అధ్యక్షుడు, తెలంగాణా అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్ ) వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, టాక్ అధ్యక్షురాలు పవిత్రరెడ్డి కంది దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అధ్యక్షుడు అశోక్ దూసరి ముఖ్య నిర్వాహకులు రత్నాకర్ కడుదుల, మల్లా రెడ్డి, రాకేష్ పటేల్, నవీన్ రెడ్డి , సత్య మూర్తి చిలుముల, సత్యపాల్ పింగిళి, జాహ్నవి, లత కూర్మాచలం, వంశీ పొన్నం, సత్యం రెడ్డి కంది, శ్రీకాంత్ జిల్లా, విద్య, క్రాంతి, వెంకీ ,రాజేష్ వాకా , భరత్ బాశెట్టి, లాస్య, శ్రీ లక్ష్మి, హరి బాబు, వెంకట్ రెడ్డి, అపర్ణ, శుశమున, విజిత రవి కిరణ్ , గణేష్ పాస్తం ,రవి రేటినేని, శైలజ ,శ్రావ్య, వినయ్ రెడ్డి, మధు సుధన్ రెడ్డి, శ్వేతా, మహేందర్, శ్వేతా మహేందర్, రంజిత్, దీపేక్షర తదితరులు పాల్గొన్నారు.