Sports

సింధుకు పద్మభూషణ్ ఇవ్వండి

Indian Sports Ministry Refers PV Sindhu For Padmabhushan

తెలుగుతేజం, బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ చాంపియన్‌ పీవీ సింధు పేరును మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్‌ కోసం క్రీడా శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు పీవీ సింధు కి అవార్డును ఇవ్వాలంటూ, కేంద్రానికి సిఫార్సులు వెళ్లినట్టు తెలుస్తోంది. 2017 లో కూడా ఇదే పురస్కారానికి సింధు పేరు సిఫార్సు అయినప్పటికీ, అవార్డుల కమిటీ మాత్రం ఎంపిక చేయలేదన్న సంగతి తెలిసిందే. ఈ దఫా ఆమెకు పద్మభూషణ్‌ ఖాయమేనని తెలుస్తోంది. ఇదే సమయంలో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్‌ కోసం ఆరు సార్లు వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌ గా నిలిచిన మేరీ కోమ్‌ పేరును కూడా క్రీడా శాఖ సిఫార్సు చేసినట్టు సమాచారం. తొలిసారిగా క్రీడా శాఖ పూర్తిగా మహిళలతోనే సిఫార్సు జాబితాను తయారు చేసినట్టు తెలుస్తోంది. క్రికెటర్‌ హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌, హాకీ జట్టు కెప్టెన్‌ రాణి రాంఫాల్‌, రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌, టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి మనికా బాత్రా, షుటర్‌ సుమా శిరూర్‌, మౌంటెనీర్లు తాషి, సుంగ్లీ మాలిక్‌ పేర్ల ను పద్మశ్రీ కి సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది.