Sports

డేవిస్ కప్ వాయిదా

Davis Cup PostPoned Due To Security Concerns

భద్రతను మరోసారి సమీక్షించిన తర్వాతే నవంబరులో పాకిస్థాన్‌తో డేవిస్‌ కప్‌ పోరు జరుగుతుందని అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) తెలిపింది. ఈనెల 14, 15 తేదీల్లో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన డేవిస్‌ కప్‌ పోరును ఐటా విజ్ఞప్తి మేరకు వాయిదా వేశారు. ‘‘నవంబరు 29, 30 లేదా నవంబరు 30, డిసెంబరు 1వ తేదీల్లో భారత్‌, పాక్‌ డేవిస్‌ కప్‌ పోరు జరుగుతుంది. మ్యాచ్‌లు ఇస్లామాబాద్‌లోనా లేదంటే తటస్థ వేదికకు మారతాయా అన్నది నవంబరు 4న మరోసారి భద్రత సమీక్ష తర్వాతే తేలుతుంది’’ అని ఐటా పేర్కొంది.