‘‘నచ్చిన పని చేయడంలో ఉన్న ఆనందమే వేరు. అందులో కష్టాలు ఉండవు. అనుభూతులు మాత్రమే కనిపిస్తాయంటోంది సాయి పల్లవి. ‘ఫిదా’, ‘ఎం.సి.ఏ’, ‘పడి పడి లేచె మనసు’ చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకుంది సాయిపల్లవి. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమా చేస్తోంది. అటు మలయాళంలోనూ తను బిజీనే. ఇంత బిజీ షెడ్యూల్లో ఇంటి పట్టున ఉండటానికి సమయం దొరుకుతుందా? అని అడిగితే ‘‘సెట్ని కూడా నేను ఇల్లులానే భావిస్తాను. అక్కడ నాతో పనిచేసేవాళ్లంతా నా మిత్రులు, కుటుంబ సభ్యులే. పైగా నా కథల ఎంపిక ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి కథకీ నేను సరిపోను. నాకు తగిన కథలనే ఎంచుకుంటుంటా. అందుకే అప్పుడప్పుడూ నాకంటూ కొంత సమయం దొరుకుతుంది. ఈ వయసులో చేతినిండా పని ఉండడమే కావాలి. తరవాత పని కావాలన్నా దొరకని పరిస్థితులు రావొచ్చు. అప్పుడు ఎలాగూ కావల్సినంత సమయం ఉంటుంది కదా’’ అంటోంది సాయి పల్లవి
ప్రతి సినిమాకు నేను సరిపోను
Related tags :