Sports

ఫైనల్‌కు భారత రెజ్లర్ దీపక్

Indian Wrestler Deepak Reaches Finals | TNILIVE Sports News

భారత రెజ్లర్‌ దీపక్‌ పునియా సంచలనం సృష్టించాడు. ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌ 86 కిలోల విభాగంలో ఫైనల్‌ చేరుకున్నాడు. దాంతో పాటు 2020 టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ సాధించాడు. సెమీస్‌లో అతడు 8-2 తేడాతో స్విట్జర్లాండ్‌కు చెందిన స్టెఫాన్‌ రీచ్‌ముత్‌ను ఓడించాడు. ఆదివారం జరిగే తుది పోరులో దిగ్గజ ఆటగాడు హసన్‌ యాజ్‌దానితో తలపడనున్నాడు. ఈ మ్యాచ్‌లో దీపక్‌ గెలిస్తే స్వర్ణం సాధించిన సుశీల్‌ కుమార్‌ సరసన నిలుస్తాడు. క్వార్టర్స్‌లో కార్లోస్‌ అర్టురో (కొలంబియా)ను ఓడించడం ద్వారా దీపక్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అంతకుముందు వినీశ్‌ ఫొగాట్‌, భజరంగ్‌, రవి దహియా టోక్యోకు బెర్తు బుక్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. జూనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, క్యాడెట్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో దీపక్‌ స్వర్ణ పతక విజేత కావడం గమనార్హం. ఇక 79 కిలోల విభాగంలో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో జితేందర్‌, 97 కిలోల విభాగంలో జరిగిన తొలిరౌండ్‌ పోరులో మౌసమ్‌ ఖత్రి ఓటమి పాలయ్యారు.