Politics

శివైక్యం చెందిన శివప్రసాద్

TDP Ex MP Sivaprasad Dies At Age 68

టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్(68) శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇవాళ మధ్యాహ్నం 2:07 గంటలకు శివప్రసాద్ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. శివప్రసాద్ ఇకలేరన్న విషయం తెలుసుకున్న అభిమానులు, అనుచరులు కన్నీరుమున్నీరవుతున్నారు. శివప్రసాద్ సొంతూరు చిత్తూరు జిల్లాలోని పూటిపల్లి. 1951 జూలై 11న నాగయ్య, చెంగమ్మ దంపతులకు నాటి మద్రాస్ రాష్ట్రంలో జన్మించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్యకళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. ఇక్కడే ప్రస్తుత టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడితో పరిచయం ఏర్పడింది. అలా వారిద్దరూ మంచి ఆప్తులుగా ఉన్నారు. శివప్రసాద్ పలు సినిమాల్లో కూడా నటించారు. ఇదిలా ఉంటే.. 2009, 2014 టీడీపీ తరఫున ఎంపీగా పోటీచేసి శివప్రాద్ విజయం సాధించారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డెప్ప చేతిలో ఓడిపోయారు.