NRI-NRT

మొక్కలు నాటిన మలేషియా తెరాస

TNILIVE Malaysia Telugu News | NRI TRS Malaysia Plants Trees

టీఆర్‌ఎస్‌ ఎన్నారై మలేసియా ఆధ్వర్యంలో గ్రీన్‌ చాలెంజ్‌ ఆదివారం మలేసియాలో మొదలైంది. అక్కడి తెలుగు సంఘాలు టీఏఎం, ఎంవైటీఏలతో కలిసి చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించారు. మలేసియా తెలుగు అకాడమీ సభ్యులు చాలెంజ్‌ స్వీకరించి అకాడమీ విద్యార్థులతో తలో 3 మొక్కల చొప్పున సుమారు 100పైగా మొక్కలు నాటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఏఎం అధ్యక్షుడు డా. అచ్చయ్య కుమార్‌ రావు, డిప్యూటీ ప్రెసిడెంట్‌ డా.వెంగట ప్రతాప్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ సీతారావు, కార్యదర్శి శివ సూర్యనారాయణ, మలేసియా తెలుగు సంఘం అధ్యక్షులు సైదం తిరుపతి, సభ్యులు అప్పరావు, రామ్మూర్తి, వెంకటేశన్‌ తదితరులు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ మలేసియా అధ్యక్షులు చిట్టిబాబు చిరుత, ఉపాధ్యక్షులు మారుతి కుర్మ, కార్యదర్శి గుండా వెంకేటశ్వర్లు, కోర్‌కమిటీ సభ్యులు మునిగల అరుణ్‌, బొయిని శ్రీనివాస్‌, బొడ్డు తిరుపతి, గద్దె జీవన్‌ కుమార్‌, రమేష్‌, సందీప్‌ కుమార్‌, సత్యనారాయణ రావు నడిపెల్లి, రవితేజ, రఘునాథ్‌, రవీందర్‌, హరీష్‌, ఇతర సభ్యులు పాల్గొన్నారు.